ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో 22 జూలై 2012 న అనకాపల్లిలోని హోటల్ విజయా రెసిడెన్సీ లో ఆదివారం ఉదయం 9 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు శ్రీ బి.వి.బంగార్రాజు గారి శతక పద్యాల పటన పోటీ లు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలకు విద్యార్థినీ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది.అనకాపల్లిలోని వివిధ విద్యా సంస్థ లే గాక చుట్టు పక్కల మండల కేంద్రాల పరిధిలోని గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.50 విద్యా సంస్థ లనుంచి, సుమారు 500 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు.
సీనియర్స్ (ఎనిమిది,తొమ్మిది,పది తరగతులు) విభాగంలో దాడి వినయ్ వెంకట్ (సీతానగరం జెడ్.పి.హైస్కూల్ ) , జి.శ్యామల (వెదురుపర్తి,జెడ్.పి.హైస్కూల్), నారాయణ సౌమ్య(పెనుగోల్లు ధర్మవరం,జెడ్.పి.హైస్కూల్) ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. ప్రథమ బహుమతిగా 1 ,500 రూపాయలు , ద్వితీయ బహుమతిగా 1 ,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 750 రూపాయలు నగదు,బంగార్రాజు గారు రచించిన శతకాలను అందజేశారు. ఈ బహుమతి కార్యక్రమంలో కవి "విశాఖరత్న" బి.వి.బంగార్రాజు, వారి కుమార్తె , అల్లుడు డాక్టర్ పద్మజ, డాక్టర్ ఐ.కె. రాజు, రామా బాలానందం సంఘం అధ్యక్షులు శ్రీ బి.ఎస్.గుప్తా, కళావేదిక అధ్యక్షులు నండూరి రామకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు. శ్రీయుతులు వేపా పార్వతీశం,భమిడిపాటి ప్రసాదరావు, కొప్పిశెట్టి సూర్యనారాయణ లు ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభకు డా.తలతోటి పృథ్వి రాజ్ అధ్యక్షత వహించారు. ఇండియన్ హైకూ క్లబ్ ప్రధాన కార్య దర్శి జి.రంగబాబు, ఉపాధ్యక్షులు గట్టి బ్రహ్మాజీలు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీనియర్స్ (ఎనిమిది,తొమ్మిది,పది తరగతులు) విభాగంలో దాడి వినయవెంకట్ (సీతానగరం, జెడ్.పి.హైస్కూల్) ప్రథమ బహుమతిని గెలుచుకున్నాడు . ఈ బహుమతి క్రింద 1 ,500/-నగదును, కవి రచించిన మౌనీ శతకం, చైతన్య శతకం లు బహుమతిగా అందుకున్నారు.
సీనియర్స్ (ఎనిమిది,తొమ్మిది,పది తరగతులు) విభాగంలో 10 వ తరగతి చదువుతున్న నారాయణ సౌమ్య (పెనుగోల్లు ధర్మవరం,జెడ్.పి.హైస్కూల్) తృతీయ బహుమతిని గెలుచుకున్నది. ఈ బహుమతి క్రింద 750 /-నగదును, కవి రచించిన మౌనీ శతకం, చైతన్య శతకం లు బహుమతిగా అందుకున్నారు.
No comments:
Post a Comment