కళ్ళూ,ముక్కు,చెవులూ ఉన్నోళ్ళందరూ ఆకార రీత్య మాత్రమే మనుషులు;గుణాలను బట్టి కాదు!.జాలీ,దయ,కరుణ,సోదరభావం,ప్రేమ మొదలగు మానవీయ గుణాలను కలిగి ఉండడాన్నే"మానవత్వం"అంటారు. ఇటువంటి సుగుణాలు పుష్కలంగా గల కవి బంగార్రాజు గారు.ఈ సమాజం బాగుండాలని, ప్రతిఒక్కరు సుఖంగా,ఆనందంగా,సామరస్యంతో,సోదర భావంతో ఉండాలని కాంక్షించిన కవి. అందుకే ఆయన మానవతావాది. అన్ని వాదాలకంటే మానవతావాదం గొప్పదని గ్రహించిన కవి బంగార్రాజు.
దేవుడు గుడిలోమాత్రమే ఉండడు!. సకల జీవ రాసుల్లోనూ ఉంటాడు!!. హృదయం లఘ్నం చేసి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడ్ని చూడవచ్చని కవి అంటాడు. మానవతావాది అయినవాడు ప్రతిఒక్కరిని ఒకటిగానే ప్రేమిస్తాడు. అందుకే ~
" పరమేశుడు గుడి లోపల
మనిషి ఎన్నో రంగాల్లో, ఎన్నో విషయాల్లో ఎదిగాడు. సృష్టికి ప్రతిసృష్టి అన్నట్లు ఎన్నో సృష్టించాడు. ఇన్ని చేసినా మానవతా విషయంలోనే మరుగుజ్జుగా ఎదగక నిలిచిపోతున్నాడు. కనుకనే ~
" ఎంతో యెదిగిన మనుజుడు
సుంతైనను మానవతను చూపడె? పొగరా?
పంతాలే జీవితమా?
చింతలు లేనట్టి బ్రతుకు శ్రేయము మౌనీ! " అని అంటారు కవి బంగార్రాజు.
ప్రేమే దైవం. ఈ లోకంలో ఒకరితో ఒకరు ప్రేమభావంతో మెలిగిన నాడు కక్షలు,కార్పణ్యాలకు తావు లేదు. అందరిలో మానవత ఉన్ననాడు భూమండలమంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ విషయాన్నే కవి బంగార్రాజు ~
" ప్రేమయె దైవం బిలలో;
" మానవత్వమిలను మహనీయ మౌనులే
పరుల సేవ చేయు తరుణ మందు;
వెన్నలోన నేయి యున్న విధమ్మున,
మానవత్వ మిమిడి మనుర; చైతు! " అని అంటారు.
ఇటువంటి ఎన్నో పద్యాలు కవి బంగార్రాజు శతకాలలో "మానవత్వాన్ని" గూర్చి రాసినవి ఉన్నాయి. ఈ పద్యాలన్నీ కవి బంగార్రాజు ను "మానవతావాది"గా నిలిపాయి.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
" పరమేశుడు గుడి లోపల
గిరిగీసు కొనుండ డమ్మ ఖేదము బాపన్;
గురినిల్పు హృదయముండిన
పరమేశుని జూతు వన్ని ప్రాణుల మౌనీ! " అని అంటాడు కవి.
" ఎంతో యెదిగిన మనుజుడు
సుంతైనను మానవతను చూపడె? పొగరా?
పంతాలే జీవితమా?
చింతలు లేనట్టి బ్రతుకు శ్రేయము మౌనీ! " అని అంటారు కవి బంగార్రాజు.
ప్రేమే దైవం. ఈ లోకంలో ఒకరితో ఒకరు ప్రేమభావంతో మెలిగిన నాడు కక్షలు,కార్పణ్యాలకు తావు లేదు. అందరిలో మానవత ఉన్ననాడు భూమండలమంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ విషయాన్నే కవి బంగార్రాజు ~
" ప్రేమయె దైవం బిలలో;
ప్రేమయె సుఖ జీవనమ్ము పెన్నిధి సుమ్మీ!
ప్రేమించు మెల్ల వారిని
భూమండల మంత శాంతి పొందును మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని అంటారు. మన కులం, మన మతం, మన ప్రాంతం...ఇటువంటి బేధ భావాలు చూపక ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని కవి భావం.
వెన్నలోనే నెయ్యి ఉన్న విధంగా మనిషిలో మానవత్వం ఇమిడి ఉన్నట్లు పరులకు సేవ చేయుచూ జీవించాలని కవి కాంక్షిస్తూ ~" మానవత్వమిలను మహనీయ మౌనులే
పరుల సేవ చేయు తరుణ మందు;
వెన్నలోన నేయి యున్న విధమ్మున,
మానవత్వ మిమిడి మనుర; చైతు! " అని అంటారు.
ఇటువంటి ఎన్నో పద్యాలు కవి బంగార్రాజు శతకాలలో "మానవత్వాన్ని" గూర్చి రాసినవి ఉన్నాయి. ఈ పద్యాలన్నీ కవి బంగార్రాజు ను "మానవతావాది"గా నిలిపాయి.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment