పురుషాధిక్య సమాజమే అయినా; నిజానికి ఈ మానవ సమాజంలో "స్త్రీ"ది అత్యున్నత స్థానం అని ప్రతిఒక్కరు ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ప్రేమకీ, త్యాగానికీ, సహనానికీ, శ్రమకు...ఒకటేమిటి!, ఇలా ఎన్నో ఉత్తమ గుణాలకు ప్రతీకగా చెప్పుకోదగిన మహోన్నత వ్యక్తిత్వం గలది స్త్రీ. కాని నేటి పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఏది గౌరవం? ఏది భద్రత? ఏది సమానత్వం?. ఇటువంటి స్థితిలో తాను స్త్రీల పక్షాన స్త్రీ పక్షపాతిగా, స్త్రీలపట్ల గౌరవ భావాన్ని కలిగినవానిగా ఉంటూ ఆయా సందర్భాలలో స్త్రీలు తమ మనో ధైర్యాన్ని కోల్పోవద్దని స్త్రీలను బలపరుస్తూ తన శతకాలలో కవి బంగార్రాజు ఎన్నో పద్యాలను రచించారు.
పురుషాధిక్య సమాజంలో చాలామంది స్త్రీలకు "నేను ఆడదానిని" అనే న్యూనతా భావం ఉంది. నేను అబలను కాదు శబలను అనే భావం కలిగించిన నాడు స్త్రీలకు అన్నిటా విజయమే అని కవి బంగార్రాజు గారు భావించి వారిని ధైర్యపరిచే ప్రయత్నం చేస్తూ ~
" అబలను నేనని క్రుంగకు;
కబళించును లోక మెల్ల కర్కశరీతిన్;
శబలను నేనని ధైర్యము
నిభిడీ కృతమైన జయము నీయది మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటారు.
పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎంతో వివక్షతకు గురిఅవుతున్నారు. వివిధ సందర్భాలను మనం పరిశీలించవచ్చు. ఉదా: ఒకేరకమైన పని. ఆ పనికి ఒకే నిర్ణీత వ్యవధిగా గల పని గంటలు. కావి వారు చేసిన శ్రమకు ప్రతిగా ఇచ్చే వేతనంలోనే వ్యత్యాసం. మగవారికి ఒక కూలీ, ఆడవారికి ఒక కూలీ. ఇంటికి దీపం ఇల్లాలు, ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుంది....ఇలాంటి మాటలు ఊరక మాట్లాడుకోదానికే అన్నట్లు లోకంలో స్త్రీల స్థితి. ఆకాశంలో సగం, హక్కుల్లో శూన్యం అన్న రీతిగా ఉన్నది నేటి స్త్రీల స్థితి. ఈ సృష్టిలో ఆదా,మగా ఇద్దరూ సమానమే! అందుకే ~
" పురుషాధిక్యపు సమాజపు
షరతులు మరి సాగ వలదు శాస్త్రము పేరన్;
తరుణుల రెండవ స్థానము
సరికాదని సమమటంచు చాటుము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని స్త్రీ పోరాటం చెయ్యాలని వారిపక్షాన కవి నిలబడతాడు.
తన జీవితానికి ఆధారమైన భర్తని కోల్పోయి దుఃఖించే స్త్రీలకు మనోధైర్యం కలిగించే మాటలు పలికారు కవి. అటువంటి స్త్రీలు దుక్ఖిన్చినంత దుఃఖించినంత మాత్రానా కరిగిపోయే లోకంకాదిది. ఇటువంటి లోకంలో తమకు ఎదురయ్యే కష్టనష్టాలకు వెరవక వారు వాటిని ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగాలని
" పతిపోయిన స్త్రీలందరు
గతిలేదని యేడ్చినంత కరుగుదురె జనుల్;
వెతలకు వెరువక నిలబడి
బ్రతుకును సాగింప తమకు భావ్యము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని అంటారు కవి బంగార్రాజు.
ఏ మ(మొన)గాడైనా ఏదోఒక విషయంలో మహిళల పట్ల సానుభూతిగా మాట్లాడితే, అలా సానుభూతిగా మాట్లాడినవారిపైకి కొందరు మగాళ్ళు కొట్లాటకు దిగుతారు. కారణం పురుషాహంకారం వారి నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంది. పురుషులు ఇటువంటి భావాన్ని విడనాడి స్త్రీలను గౌరవించాలని స్త్రీలపట్ల సమభావంగల కవి బంగార్రాజు లోకంతీరును
" మహిళ గూర్చి నెవరు మాట్లాడిననుగాని
పురుషలోక మెల్ల మొత్తు నేమొ?
పుణ్య భూమి మనది పురుషహుంకారమ్ము
నరనరాల ప్రాకి నదిర; చైతు! " అని తప్పుపడతారు.
" ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నడయాడతారు" అని చెప్పుకునే దేశం మనది. కాని ఆచరణలో స్త్రీలను పూజించడం మాని చాలా మంది మొగుళ్ళు వారి భార్యలకు "బడితపూజ" చేస్తుంటారు. అటువంటి ధోరణిగల మగాళ్ళను కవి నిశితంగా విమర్శిస్తూ
" స్త్రీల కెచట పూజ చేతురో యచ్చట
దేవతాళి వచ్చి తిరుగునంట!
బడిత పూజ చేయు భర్తల యిండ్లలో
తిరుగ రాదొ! మంచి జరుగు: చైతు! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటాడు.
రోజులు మారాయి. పురుషులతో సమానంగా స్త్రీలూ అన్ని రంగాలలో తమ శక్తి యుక్తుల్ని ప్రదర్శిస్తున్నారు."మగాడి"ననే అహంకారాన్ని మగవారు విడిఛి స్త్రీలను గుర్తించాలని,గౌరవించాలని ఆశిస్తూ కవి ~.
" స్త్రీ జాతి మేలు కొన్నది;
రోజులు మారాయి. పురుషులతో సమానంగా స్త్రీలూ అన్ని రంగాలలో తమ శక్తి యుక్తుల్ని ప్రదర్శిస్తున్నారు."మగాడి"ననే అహంకారాన్ని మగవారు విడిఛి స్త్రీలను గుర్తించాలని,గౌరవించాలని ఆశిస్తూ కవి ~.
" స్త్రీ జాతి మేలు కొన్నది;
రోజును మగవారి బూజురోసము లెల్లన్
మేజా బల్లకు వేసిన
రోజా పాలీసు పగిది స్రుక్కెడు మౌనీ! "అని అంటారు.
వివిధ దేశాలలోని స్త్రీలతో మనదేశం స్త్రీలను పోలిస్తే మనవారు వినయ సంపన్నులు. ఒకప్పటితో పోలిస్తే మెరుగైనా ఇంకా విద్యాపరంగా స్త్రీలు ఎదగాలని, ఎదిగేలా మనం వారిని చైతన్యపరచాలని కవి కాంక్షిస్తూ ~
వివిధ దేశాలలోని స్త్రీలతో మనదేశం స్త్రీలను పోలిస్తే మనవారు వినయ సంపన్నులు. ఒకప్పటితో పోలిస్తే మెరుగైనా ఇంకా విద్యాపరంగా స్త్రీలు ఎదగాలని, ఎదిగేలా మనం వారిని చైతన్యపరచాలని కవి కాంక్షిస్తూ ~
" మన దేశ మహిళలందున
వినయమునకు లోటు లేదు; విద్యాపరమై
కనజాలము నభివృద్ధిని;
జన జాగృతి సేయు పనిని జరుపుము మౌనీ! " అని అంటారు. ఇవేకాదు; మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని "మహిళా"శీర్షికతో ఖండ పద్యాలను కూడా రాసి "మౌనీ రాగాలు" అనే తన శతకంలో ముద్రించారు బంగార్రాజు. ఈ విధంగా కవి బంగార్రాజు స్త్రీపక్షపతి అని నిరూపించే పద్యాలు ఈ శతకాల్లో చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని భర్తగా పొందిన సత్యవతిగారు అదృష్టవంతులు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment