ప్రప్రంచ దేశాలలో కెల్లా భారతదేశ చరిత్ర,సంస్కృతికి విశిష్ట స్థానమున్నది. భిన్న మతాలు,భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఇక్కడి ప్రజలు అనుసరిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తూ ఉంటారు. గొప్పదైన మన చరిత్రను, మన సంస్కృతిని మనం గుర్తించాలి,గౌరవించాలి,కాపాడుకోవాలి అని కవి అనేక సందర్భాలలో తన శతక పద్యాలద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
భారత దేశ సంస్కృతి, మన ధర్మం ప్రపంచ దేశాలలోకెల్లా గొప్పదని ~
" మన సంస్కృతి, మన ధర్మము
ఘనమైనది విశ్వమందు కాదన గలరే!
కనజాలని మౌడ్యముచే
మనముంటిమి తెలివికలిగి మసలుము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటాడు. ఇటువంటి విలువైన మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. భావితరాల వారికి తరగని ఆస్తిగా మనం అందించాలనేదే కవి భావం.
ఈ దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలూ మొదలగు గొప్ప అంశాలలో ఒకటి పెళ్లి. మన స్త్రీల కట్టూ బొట్టు తో పాటు విదేశీయులను సైతం ఆకర్షించే అంశం పెళ్లి. అంతేకాదు మన దేశీయుల దాంపత్య జీవితం కూడా దృఢమైనది. విదేశీయుల మాదిరి పెళ్ళైన మరుక్షణం విడాకులు తీసుకోవడం ఈదేశంలో కుదరని పని. ఈ దేశంలో మాంగల్యానికి అంత విలువుంది.వీటిని దృష్టిలో పెట్టుకొనే ~
" మన ఆచారపు, పెండిలి
మన దాంపత్యంపు సరళి, మన జీవనముల్
కనమెందు విశ్వమందున
కన్నూ,మిన్నూ కానక; బాధ్యత లెరుగక, ఎవరినీ లెక్క చేయక యౌవన కాలంలో కొందరు జీవితాన్ని వృధా చేస్తుంటారు. భర్తగా, తండ్రిగా బాధ్యతలు-వయసూ పైపడ్డాక చేసిన తప్పులకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ప్రాణాలు పోయేవరకు నీతివంతమైన నడవడికను కలిగి ఉండడమే ఈ దేశ సంస్కృతి అని చాటుతూ ~
" కన్ను మిన్ను కనక గడిపిన కాలమ్ము
కాల్చు జనుల చివరి కాలమందు;
నీతి వర్తనమ్ము నీదేశ సంస్కృతి;
నిలుపు చివర వరకు నీవు; చైతు!" అని అంటాడు కవి.
భారతదేశం అంటే యోగి పుంగవులకు, ఋషులకు నెలవైనది. అన్ని మతముల సమతను కోరుకునే ఈ దేశ సంస్కృత గొప్పదనాన్ని
" భరతదేశ మన్న గురుపరంపర, యోగ
పుంగవులకును, ఋషి పూజ్యులకును
నెలవు; విశ్వమందు వెలసిన మతముల
ఈవిధంగా మనదేశ చరిత్ర, సంస్కృతిని కవి కీర్తిస్తూ ,నేటి తరానికి గుర్తుచేస్తూ తన రెండు శతకాలలో కొన్ని పద్యాలను రచించారు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment